EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చేర్యాల మాజీ జడ్పీటీసీ సుంకరి సరిత కన్నుమూత

    Author THADEM PRASHANTH | 08 Aug 2026, 09:41 PM | TELANGANA
    చేర్యాల మాజీ జడ్పీటీసీ సుంకరి సరిత కన్నుమూత

    కన్నీటి వీడ్కోలు.. కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా
    హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ సుంకరి సరిత (44) క్యాన్సర్‌తో పోరాడుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. ఆమె మృతితో ఆకునూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
    శనివారం సుంకరి సరిత పార్థివదేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలకు హాజరై కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

    2014 నుంచి 2019 వరకు జడ్పీటీసీగా పనిచేసిన సుంకరి సరిత, తన పదవీకాలంలో మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని నాయకులు గుర్తు చేసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా గుర్తింపు పొందారని కొనియాడారు.

    మాజీ మార్కెట్ చైర్మన్ మల్లేశం గౌడ్‌కు పరామర్శ
    సుంకరి సరిత మృతి నేపథ్యంలో ఆమె భర్త, చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.
    సుంకరి సరిత మృతి చేర్యాల మండలానికి తీరని లోటని, ఆమె ప్రజాసేవలను ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని పలువురు నాయకులు పేర్కొన్నారు.