EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నర్సాయపల్లి లో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

    Author THADEM PRASHANTH | 05 Aug 2026, 07:59 PM | TELANGANA
    నర్సాయపల్లి లో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

    మొదటి ఆరు నెలలు తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆహారం: సర్పంచ్ శనిగరం సత్యనారాయణ
    హిందుస్థాన్ మీడియా, మద్దూరు: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
    ఐసీడీఎస్ సూపర్వైజర్ రాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మద్దూరు మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ శనిగరం సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టిన వెంటనే శిశువుకు ముర్రు పాలు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, జననం నుంచి మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు. తల్లులు పోషకాహారం తీసుకోవడం ద్వారా శిశువులకు నాణ్యమైన తల్లిపాలు అందుతాయని వివరించారు.
    ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ బాలమణి, రిలయన్స్ ఫౌండేషన్–క్రై సంస్థ ప్రతినిధి భార్గవి, శిశువుల తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు.