గాగిల్లాపూర్ సర్పంచ్ కనకచంద్రం కు పితృవియోగం

హిందుస్థాన్ మీడియా, మద్దూరు: సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం గాగిల్లాపూర్ గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనకచంద్రం తండ్రి ఇట్టబోయిన యాదగిరి అనారోగ్యంతో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందారు. యాదగిరి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కనకచంద్రాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మనోధైర్యంగా ఉండాలని సూచించారు.