వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇల్లంతకుంట ఎస్ ఐ అశోక్
వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లొద్దు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచన హిందుస్థాన్ మీడియా, ( రాజన్న సిరిసిల్ల జిల్లా) ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, కాలువల్లో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా యువత సెల్ఫీలు దిగేందుకు, ఈత కొట్టేందుకు ఇలాంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు...