పార్లమెంట్ సజావుగా సాగాలి : ప్రధాని మోదీ
వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా జరగాలి.. వాస్తవాల ఆధారంగా చర్చలు జరపాలని ఎంపీలకు పిలుపు న్యూఢిల్లీ, హిందుస్థాన్ మీడియా: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా, ఫలప్రదంగా సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ఆయన, దేశ ప్రయోజనాలే ప్రధానంగా చర్చలు జరగాలని, గందరగోళం కాకుండా వాస్తవాల ఆధారంగా చర్చించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందన్నారు. గత నెలలో భారత్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక కీలక విజయాలు సాధించిందని ప్రధాని పేర్కొన్నారు. యువ శాస్త్రవేత్తలు, స్టార్టప్లు దేశ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచాయని తెలిపారు. సగటు 28 ఏళ్ల వయస్సు కలిగిన స్కైరూట్ బృందం చరిత్ర సృష్టించడం దేశ...