హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకముందే చేర్యాలను హెచ్చరించిన ప్రమాదం
గుంతల రోడ్డులో ఒరిగిన పెట్రోల్ ట్యాంకర్.. తృటిలో తప్పిన పెను విపత్తు
హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల పట్టణంలోని అంగడి బజార్–ఆకునూరు రహదారిపై శుక్రవారం చోటుచేసుకున్న పెట్రోల్ ట్యాంకర్ ఘటన మరోసారి రహదారి దుస్థితిని, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేలా చేసింది. గుంతలతో నిండిన రహదారిలో లోడ్తో వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ ఒక్కసారిగా పక్కకు ఒరిగి తృటిలో భారీ ప్రమాదం తప్పింది.
ఇటీవల జరిగిన చేర్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో (జూలై 29) ఇదే రహదారిపై భారీ గుంతలు ఉండటంతో వాహనదారులకు ప్రమాదం జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. అయితే ఆ తీర్మానం అమలుకాకముందే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, గుంతలో చక్రం దిగడంతో పెట్రోల్ ట్యాంకర్ ఒకవైపుకు ఒరిగింది. అదృష్టవశాత్తూ ట్యాంకర్ పూర్తిగా బోల్తా పడకపోవడంతో పాటు ఇంధనం లీక్ కాకపోవడంతో భారీ అగ్నిప్రమాదం తప్పింది. లేకపోతే జనసంచారం ఎక్కువగా ఉండే ఈ మార్గంలో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు మాట్లాడుతూ, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా రహదారిని తక్షణమే మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం బోర్డులు పెడితే సమస్య పరిష్కారం కాదని, గుంతలను పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చాలని కోరుతున్నారు."ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు... ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలి" అని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఈ ఘటనను హెచ్చరికగా తీసుకుని సంబంధిత అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల పట్టణంలోని అంగడి బజార్–ఆకునూరు రహదారిపై శుక్రవారం చోటుచేసుకున్న పెట్రోల్ ట్యాంకర్ ఘటన మరోసారి రహదారి దుస్థితిని, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేలా చేసింది. గుంతలతో నిండిన రహదారిలో లోడ్తో వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ ఒక్కసారిగా పక్కకు ఒరిగి తృటిలో భారీ ప్రమాదం తప్పింది.
ఇటీవల జరిగిన చేర్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో (జూలై 29) ఇదే రహదారిపై భారీ గుంతలు ఉండటంతో వాహనదారులకు ప్రమాదం జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. అయితే ఆ తీర్మానం అమలుకాకముందే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, గుంతలో చక్రం దిగడంతో పెట్రోల్ ట్యాంకర్ ఒకవైపుకు ఒరిగింది. అదృష్టవశాత్తూ ట్యాంకర్ పూర్తిగా బోల్తా పడకపోవడంతో పాటు ఇంధనం లీక్ కాకపోవడంతో భారీ అగ్నిప్రమాదం తప్పింది. లేకపోతే జనసంచారం ఎక్కువగా ఉండే ఈ మార్గంలో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు మాట్లాడుతూ, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా రహదారిని తక్షణమే మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం బోర్డులు పెడితే సమస్య పరిష్కారం కాదని, గుంతలను పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చాలని కోరుతున్నారు."ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు... ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలి" అని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఈ ఘటనను హెచ్చరికగా తీసుకుని సంబంధిత అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.