🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 21 Jul, 2026 | Page: 1

రాజేంద్ర నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

(నేతి పృథ్వి - రిపోర్టర్)
ఐదు డివిజన్లకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
హిందుస్థాన్ మీడియా, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలు డివిజన్లకు కొత్త అధ్యక్షులను నియమించింది. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
నియమితులైన డివిజన్ అధ్యక్షులు:
నార్సింగి: అశోక్ యాదవ్
నెక్నాంపూర్: జితేందర్
గండిపేట్: నరేందర్
మణికొండ: శ్రీరాములు
కోకాపేట్: దుర్గేష్ యాదవ్
నూతనంగా నియమితులైన అధ్యక్షులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సంస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నాయకత్వం సూచించింది.
🏠 Home