🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 19 Jul, 2026 | Page: 1

ఇల్లంతకుంట డిప్యూటీ తహశీల్దార్ గా నజీర్ బాధ్యతల స్వీకరణ

ఇల్లంతకుంట, హిందుస్థాన్ మీడియా: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎండీ నజీర్ బాధ్యతలు స్వీకరించినట్లు తహసీల్దార్ సురేష్ కుమార్ తెలిపారు.
గతంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసిన సత్యనారాయణ అక్టోబర్ నెలలో పదవీ విరమణ పొందడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించిన ఎండీ నజీర్ పదోన్నతిపై ఇల్లంతకుంట మండలానికి బదిలీ అయి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
-గొట్టిపర్తి ముత్తయ్య -రిపోర్టర్
🏠 Home