🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 18 Jul, 2026 | Page: 1

అందెశ్రీ స్మృతి వనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన

హైదరాబాద్, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో ఏర్పాటు చేయనున్న అందెశ్రీ స్మృతి వనంకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం అందెశ్రీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, "అందెశ్రీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కవి, గాయకుడు, ఉద్యమకారుడు అయితే.. నాకు మాత్రం ఆత్మబంధువు" అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ రచించిన పాటలు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చాయని కొనియాడారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అందెశ్రీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
🏠 Home